కశ్మీర్‌లో ఉగ్రదాడి.. 30కి పైగా జవాన్లు కన్నుమూత

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30 మందికి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. జమ్ము-శ్రీనగర్ హైవేపై జవాన్లు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉగ్ర దాడి జరిగింది. 78 వాహనాల్లో సుమారు 2500 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ కాన్వాయ్ అవంతిపుర ప్రాంతం సమీపంలోకి రాగానే దాడి జరిగింది. శ్రీనగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడితో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. వెంటనే రాష్ట్రంలో హై […]

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. 30కి పైగా జవాన్లు కన్నుమూత
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:29 PM

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30 మందికి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. జమ్ము-శ్రీనగర్ హైవేపై జవాన్లు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉగ్ర దాడి జరిగింది. 78 వాహనాల్లో సుమారు 2500 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ కాన్వాయ్ అవంతిపుర ప్రాంతం సమీపంలోకి రాగానే దాడి జరిగింది. శ్రీనగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడితో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. వెంటనే రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.

దాడికి పాల్పడింది తామే అని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి చేసిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ పుల్వామాలోని కకపోర ప్రాంతానికి చెందినవాడు. 2018లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. దాడికి గురైన బస్సులో 39 మంది ప్రయాణిస్తున్నారని, అందులో 76వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ దాడిని పలువురు నాయకులు ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇదొక తుచ్చమైన చర్య అని, మన సైనికుల ప్రాణ త్యాగం వృధా కాకూడదని అన్నారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు అండగా దేశం మొత్తం ఉంటుందని, గాయాలపాలైన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ దాడిలో సుమారు 20కిపైగా గాయాలపాలయ్యారు.