భారత్-పాక్ అణుయుద్ధంతో కలిగే నష్టాలేంటి..?

భారతదేశం.. పాకిస్తాన్‌తో విడిపోయినప్పటి నుంచీ.. ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్‌లో వివాదాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. భారత్ వెనక్కి ఎంత తగ్గుతున్నా.. పాక్‌ మాత్రం వెక్కసు వెల్లగక్కుతూనే ఉంది. ఈ మధ్యనే.. జరిగిన పూల్వామా ఉగ్రదాడి సమయంలో భారత్, పాక్‌లు హోరాహొరీగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాగా.. తాజాగా.. కశ్మీర్ స్వయం ప్రత్తి విషయంలో పాక్.. భారత్‌పై తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతూ ఉంది. ఆర్థికల్ 370 రద్దు తర్వాత.. భారత్-పాక్‌ల మధ్య […]

భారత్-పాక్ అణుయుద్ధంతో కలిగే నష్టాలేంటి..?
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 9:58 AM

భారతదేశం.. పాకిస్తాన్‌తో విడిపోయినప్పటి నుంచీ.. ఈ రెండు దేశాల మధ్య ఓ రేంజ్‌లో వివాదాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. భారత్ వెనక్కి ఎంత తగ్గుతున్నా.. పాక్‌ మాత్రం వెక్కసు వెల్లగక్కుతూనే ఉంది. ఈ మధ్యనే.. జరిగిన పూల్వామా ఉగ్రదాడి సమయంలో భారత్, పాక్‌లు హోరాహొరీగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాగా.. తాజాగా.. కశ్మీర్ స్వయం ప్రత్తి విషయంలో పాక్.. భారత్‌పై తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతూ ఉంది. ఆర్థికల్ 370 రద్దు తర్వాత.. భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

కాగా.. ఆర్థికల్ 370 రద్దుపై తమ అక్కసును వెళ్లగక్కుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మాటల యుద్ధాలే చేశారు. ఈ పరిణామాలతో.. ఒకవేళ యుద్ధం మొదలైతే.. ఏం జరుగుతుంది..? ఎంత నష్టం జరుగుతుంది?. ఈ యుద్ధం అణు యుద్ధానికి దారితీస్తే.. ఏమౌతుంది..? తాజాగా.. ఈవిషయంపై అధ్యయనం చేశారు అమెరికాలోని రట్‌గర్స్ యూనివర్శిటీ స్టూడెంట్స్. ఈ వివరాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. ఈ ఆర్టికల్‌పై ప్రపంచదేశాల నడుమ చర్చ జరుగుతోంది.

పరిశోధనలో విద్యార్థుల అధ్యయనం చేసిన కీ పాయింట్స్:

1. అణు యుద్ధం వల్ల.. కొన్ని వారాల్లోనే సుమారు 16 నుంచి 36 మిలియన్ టన్నుల పొగ వాతావరణాన్ని కప్పేస్తుంది 2. ఈ పొగ 10 సంవత్సరాలైనా.. వాతావరణాన్ని వీడదు 3. భూమిని చేరే సూర్యకాంతి క్షీణిస్తుంది. 4. పొగ కారణంగా.. సూర్యుని నుంచి రేడియేషన్స్ గ్రహించి గాలిని వేడెక్కిస్తుంది. 5. దీంతో.. మానవులతో సహా ఏ జీవి ఎక్కువ రోజులు బ్రతకలేదు 6. వర్షపాతం క్షీణిస్తుంది 7. నీరు, గాలి పూర్తిగా కలుషితమవుతాయి 8. సముద్రాల నుంచి ఆహారోత్పత్తి క్షీణిస్తుంది. 9. అడవులు నశిస్తాయి. వృక్ష సంపద నశిస్తుంది. 10. ఈ అణు యుద్ధం వల్ల ఇరు దేశాల్లో కలిగే మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే.. 100 నుంచి 125 మిలియన్ల ప్రజలు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా.. ప్రపంచంలోనే 9 దేశాల వద్దనే అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రస్తుతం.. భారత్, పాక్‌ కూడా వీటిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. కానీ.. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితి ఏర్పాడితే.. మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని.. యూనివర్శిటీ విద్యార్థులు చెప్పుకొచ్చారు.