50 ఏళ్ళ క్రితం… జాబిల్లిపై వాళ్ళు కాలు పెట్టిన క్షణం
సరిగ్గా 50 ఏళ్ళ క్రితం చంద్రునిపై అమెరికన్ వ్యోమగాములు కాలు పెట్టారు. ఈ నెల 20 (శనివారం)తో యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ‘ నాసా ‘ ఒక్కసారి ఆ ఘట్టాలను తలచుకుంది. 1969 జులై 20 నాటి సంగతి అది. ఈ అంతరిక్ష సంస్థ చేపట్టిన అపోలో కార్యక్రమం కింద వరుసగా 8 మంది వ్యోమగాములు చంద్రయానం చేశారు. అవి మొత్తం 9 మిషన్లు. నాడు జాబిల్లిపై కాలు మోపిన వారంతా ఇటీవల న్యూయార్క్ సిటీలో […]
సరిగ్గా 50 ఏళ్ళ క్రితం చంద్రునిపై అమెరికన్ వ్యోమగాములు కాలు పెట్టారు. ఈ నెల 20 (శనివారం)తో యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ‘ నాసా ‘ ఒక్కసారి ఆ ఘట్టాలను తలచుకుంది. 1969 జులై 20 నాటి సంగతి అది. ఈ అంతరిక్ష సంస్థ చేపట్టిన అపోలో కార్యక్రమం కింద వరుసగా 8 మంది వ్యోమగాములు చంద్రయానం చేశారు. అవి మొత్తం 9 మిషన్లు. నాడు జాబిల్లిపై కాలు మోపిన వారంతా ఇటీవల న్యూయార్క్ సిటీలో సమావేశమై అప్పటి మధుర ఘట్టాలను తలచుకున్నారు. నేటికీ జీవించి ఉన్న 17 మంది ఏస్ట్రోనట్స్ లో… వాల్టర్ కన్నింగ్ హామ్, రూస్తీ షెవికార్ట్, ఫ్రేడ్ హెస్ , చార్లీ డ్యూక్, హారిసన్ షిమిటో. మైఖేల్ కొలిన్స్ వంటివారున్నారు. సెలబ్రిటీ ఈవెంట్ లో వీరంతా పాల్గొన్నారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తరువాత చంద్రునిపై కాలు మోపిన రెండో వ్యోమగామి తన 82 వ ఏట 2012 లో మరణించారు. ఇక వ్యోమగాముల్లో ప్రస్తుతం 88 ఏళ్ళ వయస్సువాడైన కొలిన్స్.. కెన్నెడా స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ కి చేరుకొని.. ఆనాటి ఘట్టాన్ని తలచుకున్నాడు. గతంలో ఆల్డ్రిన్, ఆర్మ్ స్ట్రాంగ్ లతో బాటు ఇక్కడి నుంచే అంతరిక్షయానం చేశాడాయన. తాను ఇన్నేళ్లకు మళ్ళీ ఇక్కడకు చేరుకోవడం థ్రిల్ అని అభివర్ణించాడు. అటు- 50 ఏళ్ళ క్రితం నాటి అపోలో కార్యక్రమం తాలూకు ఫోటోలను నాసా రిలీజ్ చేసింది.