సానా సతీశ్కు కస్టడీ ఆగస్టు 23 వరకు పొడిగింపు
మొయిన్ ఖురేషీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త సానా సతీశ్కు ఆగస్టు 23 వరకు కస్టడీని పొడిగిస్తూ ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు తమకు సమయం కావాలని తెలపడంతో న్యాయస్థానం అంగీకరించింది. ఖరేషీ అక్రమాస్తుల కేసులో సానా సతీశ్ సాక్షిగా ఉన్నాడు. ఆయనను జూలై 26న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా హవాల డబ్బును చలామణీ చేయడంలో మొయిన్ ఘురేషీ ఆరోపణలు ఎదుర్కొటున్నాడు. ఈ కేసులో […]
మొయిన్ ఖురేషీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త సానా సతీశ్కు ఆగస్టు 23 వరకు కస్టడీని పొడిగిస్తూ ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు తమకు సమయం కావాలని తెలపడంతో న్యాయస్థానం అంగీకరించింది.
ఖరేషీ అక్రమాస్తుల కేసులో సానా సతీశ్ సాక్షిగా ఉన్నాడు. ఆయనను జూలై 26న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా హవాల డబ్బును చలామణీ చేయడంలో మొయిన్ ఘురేషీ ఆరోపణలు ఎదుర్కొటున్నాడు. ఈ కేసులో సానాకు కూడా పాత్ర ఉన్నట్టు బయటపడటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సతీశ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.