బ్యాంకుల్లో బంగారంపై మోదీ నజర్..ఎక్కువుంటే అంతే సంగతి !

బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టుకుని నిశ్చింతగా వుంటున్నారా ? ఇకపై ఆ నిశ్చింతకు నీళ్ళొదలాల్సిందే. ఎందుకంటే.. దేశంలోని బ్యాంకుల్లో మూలుగుతున్న బంగారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. లెక్కలేనంతగా బంగారం కొనుక్కున్న సంపన్నులకు మోదీ సర్కార్ షాకివ్వబోతోంది. లాకర్లలో ఎంత బంగారం వుందో, బ్లాక్ మనీని బంగారంగా మార్చుకుని ఎందరు పన్ను ఎగవేస్తున్నారో లెక్క తేల్చేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందుకోసం కొత్త చట్టాన్నిత్వరలో జరిగే కేబినెట్ భేటీలో ప్రతిపాదించబోతున్నారు. అమ్నెస్టీ తరహా చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారని […]

బ్యాంకుల్లో బంగారంపై మోదీ నజర్..ఎక్కువుంటే అంతే సంగతి !
Follow us

|

Updated on: Oct 30, 2019 | 1:26 PM

బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టుకుని నిశ్చింతగా వుంటున్నారా ? ఇకపై ఆ నిశ్చింతకు నీళ్ళొదలాల్సిందే. ఎందుకంటే.. దేశంలోని బ్యాంకుల్లో మూలుగుతున్న బంగారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. లెక్కలేనంతగా బంగారం కొనుక్కున్న సంపన్నులకు మోదీ సర్కార్ షాకివ్వబోతోంది. లాకర్లలో ఎంత బంగారం వుందో, బ్లాక్ మనీని బంగారంగా మార్చుకుని ఎందరు పన్ను ఎగవేస్తున్నారో లెక్క తేల్చేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందుకోసం కొత్త చట్టాన్నిత్వరలో జరిగే కేబినెట్ భేటీలో ప్రతిపాదించబోతున్నారు.

అమ్నెస్టీ తరహా చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్త చట్టం ప్రకారం తమ వద్ద ఎంత బంగారం వుందో వెల్లడించేందుకు ప్రతీ ఒక్క భారత పౌరునికి నిర్దిష్టమైన గడువిస్తారు. ఆ తర్వాత నేరుగా బ్యాంకుల్లో సోదాలు నిర్వహించి లాకర్లలో మగ్గుతున్న బంగారం వివరాలు సేకరిస్తారు. భారీగా ఫైన్ వసూలు చేస్తారు.

కొత్త చట్టం ప్రకారం ఒక కుటుంబానికి 4 కిలోల కంటే ఎక్కువ బంగారం వుంటే దాన్ని కేంద్రం స్వాధీనపరచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సంస్థలైతే 20 కిలోల బంగారం వరకూ వుంచేసుకోవచ్చు. నిర్దేశిత గడువులోగా తమ వద్ద ఉన్న బంగారం ఎంతో తెలియచెబితే ఓకే.. లేకపోతే భారీగా అపరాధ రుసుములను విధించేందుకు వీలుగా కొత్త చట్టం రూపొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

బ్యాంకుల్లో పనిచేసే బంగారం వాల్యూయర్ సర్టిఫికేట్లను ముందుగా పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. భారతీయ వివాహిత స్త్రీలకు బంగారంతో అలవికాని అనుబంధం వున్న దృష్ట్యా సెంటిమెంటును కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. భారత దేశం ప్రతీ ఏటా 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను అంటే 35 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది.

ఫలితంగా భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు హరించుకుపోతున్నాయని కేంద్రం భావిస్తోంది. పలు ఎగుమతుల ద్వారా ఆర్జిస్తున్న విదేశీ మారక నిల్వలు బంగారం కోసం హరించుకుపోవడం కరెక్టు కాదని మోదీ భావిస్తున్న నేపథ్యంలో కొత్త చట్టం తెచ్చేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం.

త్వరలో గోల్డ్ బోర్డ్

ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రతిపాదన మేరకు దేశంలో కొత్తగా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు కూడా రంగం సిద్దమవుతోంది. ఈ బోర్డులో ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేటు సెక్టర్ వ్యక్తులతో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆకర్షనీయమైన బంగారం పథకాలను, గోల్డు బాండ్ల పథకాలను రూపొందించడంతోపాటు ప్రజలను పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రోత్సహించడమే ఈ గోల్డు బోర్డు బాధ్యత అని భావిస్తున్నారు. భారతీయ ప్రధాన ఆలయాల్లో లెక్కలేనంతగా బంగారం నిల్వలు పేరుకుపోయాయి. ఒక్క తిరుమలేశుని ఖజానాలోనే టన్నుల కొద్దీ బంగారం పడి మూలుగుతోంది. ప్రతీ రోజుల ఇంకా ఎందరో ఆలయాలకు బంగారాన్ని దానంగా ఇస్తుండడంతో నిల్వలు భారీగా, వేగంగా పెరుగుతున్నాయి.

డిసెంబర్ 2 నుంచి బంగారం బాండ్లు ?

అక్టోబర్ 25వ తేదీన నిలిపేసిన బంగారం సావరీన్ బాండ్ల జారీని డిసెంబర్ 2న ప్రారంభించి, నాలుగు రోజుల పాటు కొనసాగించాలని, డిసెంబర్ ఆరవ తేదీన బాండ్ల జారీని క్లోజ్ చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త ప్రతిపాదనలను గత నెలలోనే రూపొందించినప్పటికీ.. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల దృష్ట్యా కొద్దిగా వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది.