ఏపీలో ప్రధాని మోడీ పర్యటన

విజయవాడ: ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీలో ప్రచారం నిర్వహించనుననారు. ఈ నెల 29న రాజమండ్రికి రాబోతున్నారు. ప్రధాని భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత కర్నూలులో మోదీ సభ ఉండే అవకాశం ఉందని కూడా జీవీఎల్ తెలిపారు. ఈ నెల 24, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా 480 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్నట్టు ఆయన […]

ఏపీలో ప్రధాని మోడీ పర్యటన
Follow us

|

Updated on: Mar 23, 2019 | 8:37 AM

విజయవాడ: ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీలో ప్రచారం నిర్వహించనుననారు. ఈ నెల 29న రాజమండ్రికి రాబోతున్నారు. ప్రధాని భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత కర్నూలులో మోదీ సభ ఉండే అవకాశం ఉందని కూడా జీవీఎల్ తెలిపారు.

ఈ నెల 24, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా 480 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. 26న మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఏపీకి కేంద్రం అందించిన నిధులు, చేసిన సాయంపై కరపత్రాలు విడుదల చేస్తామని జీవీఎల్ తెలిపారు.