48 గంటల్లో మోడల్ హౌస్.. ఏపీలో తొలిసారి
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రయోగాత్మక మోడల్ హౌస్ నిర్మితమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అత్యుత్తమ టెక్నాలజీతో
Model House in AP: ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రయోగాత్మక మోడల్ హౌస్ నిర్మితమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 గజాల్లో అత్యుత్తమ టెక్నాలజీతో మోడల్ హౌస్ను నిర్మించారు. సోలార్ రూఫ్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్తో ఈ మోడల్ హౌస్ని 48 గంటల్లో పూర్తి చేశారు. ఈ హౌస్ని రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో తొలిసారి ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని అన్నారు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడానికి అవకాశం కలుగుతుందని భరత్ వివరించారు. ఈ మోడల్ హౌస్ నిర్మాణానికి మూడున్నర లక్షల లోపు ఖర్చు అవుతుందని ఎంపీ తెలిపారు.
Read More:
‘ఆర్ఆర్ఆర్’ కోసం రమా రాజమౌళి అదనపు బాధ్యతలు!