సినిమాల్లో చూపించినట్టుగానే జరిగిన దొంగతనం
అచ్చంగా సినిమాల్లో చూపించినట్టుగానే ఓ దొంగతనం జరిగింది.. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లతో వెళుతున్న ఓ కంటైనర్ను అడ్డగించి అందులో ఉన్న ఫోన్లను ఎత్తుకెళ్లారు దొంగలు.. చిత్తూరులో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాల్గా మారింది..
అచ్చంగా సినిమాల్లో చూపించినట్టుగానే ఓ దొంగతనం జరిగింది.. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లతో వెళుతున్న ఓ కంటైనర్ను అడ్డగించి అందులో ఉన్న ఫోన్లను ఎత్తుకెళ్లారు దొంగలు.. నిన్న రాత్రి చిత్తూరులో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాల్గా మారింది.. శ్రీ పెరంబూర్ నుంచి ముంబాయికి బయలుదేరిన మొబైల్ లోడ్ కంటైనర్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నగరి దగ్గరకు రాగానే ఆ కంటైనర్కు లారీ అడ్డం పెట్టారు దొంగలు.. కంటైనర్ ఆగగానే అందులోని డ్రైవర్ కొట్టేసి మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు.. తర్వాత లారీ పుత్తూరుకు చేరుకోగానే మొబైల్స్ను ఎంతో తెలివిగా వేరే లారీలోకి మార్చుకున్నారు.. దొంగతనానికి వాడిని లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. దొంగతనం జరిగిన సమయంలో కంటైనర్లో దాదాపు 16 బాక్స్లు ఉంటే .. అందులో ఎనిమిది బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను దొంగలు దోచుకెళ్లారు. కంటైనర్లోని మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షావోమీ కంపెనీ చెందినవి.