ఎన్నికల వేళ జమ్మూలో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా ముందుజాగ్రత్త చర్యగా గురువారం శ్రీనగర్, ఉధంపూర్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గురువారం శ్రీనగర్, ఉధంపూర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోయలో భద్రతా దళాలను మోహరించారు. భారీ భద్రత మధ్య గురువారం పోలింగ్ సాగుతోంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు పోలింగ్ వేళ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు స్పష్టం […]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా ముందుజాగ్రత్త చర్యగా గురువారం శ్రీనగర్, ఉధంపూర్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గురువారం శ్రీనగర్, ఉధంపూర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోయలో భద్రతా దళాలను మోహరించారు. భారీ భద్రత మధ్య గురువారం పోలింగ్ సాగుతోంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు పోలింగ్ వేళ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.