నేడు MMTS రైళ్లు పాక్షికంగా రద్దు

ఇవాళ నగరంలోని పలు ప్రాంతాలకు MMTS రైళ్లో వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకే ఈ గమనిక.. నేడు ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రోజు కేవలం ఫలక్‌నుమా- సికింద్రాబాద్ మధ్య మాత్రమే  సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. అలాగే నాంపల్లి – ఫలక్‌నుమా, సికింద్రాబాద్ – ఫలక్‌నుమా మధ్య రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలు కేవలం ట్రాక్ మరమ్మత్తుల దృష్ట్యా […]

నేడు MMTS రైళ్లు పాక్షికంగా రద్దు
Follow us

|

Updated on: Sep 22, 2019 | 11:10 AM

ఇవాళ నగరంలోని పలు ప్రాంతాలకు MMTS రైళ్లో వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకే ఈ గమనిక.. నేడు ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రోజు కేవలం ఫలక్‌నుమా- సికింద్రాబాద్ మధ్య మాత్రమే  సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. అలాగే నాంపల్లి – ఫలక్‌నుమా, సికింద్రాబాద్ – ఫలక్‌నుమా మధ్య రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలు కేవలం ట్రాక్ మరమ్మత్తుల దృష్ట్యా చేపట్టినట్లు తెలిపారు.

ఎంఎంటీఎస్ రెండో దశ మొదటి భాగాన్ని 2019 అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో దశ ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయాణీకులను ఆకర్షించే విధంగా రైళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇకపై రైళ్లన్నీ ముదురు గులాబీ రంగులో మెరిసిపోనున్నాయి.