టీడీపీ-వైఎస్సార్‌సీపీ ట్వీట్ వార్… విజయసాయి కామెంట్లకు బుద్ధా కౌంటర్!

టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ పై చంద్రబాబు, టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం.. ఆ వెంటనే బుద్దా వెంకన్న కౌంటరివ్వడం మామూలే. తాజాగా విజయసాయి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్దా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదంటూ ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీపై సెటైర్లు పేల్చారు. ‘ఢిల్లీలో కూర్చుని కాళ్ళు పట్టుకునే నీకు, అపాయింట్మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ జగన్‌కి […]

టీడీపీ-వైఎస్సార్‌సీపీ ట్వీట్ వార్... విజయసాయి కామెంట్లకు బుద్ధా కౌంటర్!
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 5:21 PM

టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ పై చంద్రబాబు, టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం.. ఆ వెంటనే బుద్దా వెంకన్న కౌంటరివ్వడం మామూలే. తాజాగా విజయసాయి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్దా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదంటూ ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీపై సెటైర్లు పేల్చారు.

‘ఢిల్లీలో కూర్చుని కాళ్ళు పట్టుకునే నీకు, అపాయింట్మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ జగన్‌కి విశ్వసనీయత అర్ధం తెలుసనుకోవడంలేదు శకుని మామా విజయసాయిరెడ్డి! మీ తప్పుల్ని చంద్రబాబుగారు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.

‘దాదాపు 70 లక్షలమంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది శకుని మామా. తెదేపా హయాంలో చంద్రబాబుగారు ప్రజలకు ఉచితంగా ఇసుకని ఇచ్చారు. కార్మికుల కడుపు నింపారు. మీ జగన్ మాత్రం ఉన్న ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేసాడు. పిల్లికి బిచ్చం  పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ శకుని మామా !’అని విజయసాయి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.