చంద్రబాబుకు షాక్.. టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్బై
ఏపీలో చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. తాజాగా
MLA Vasupalli Ganesh: ఏపీలో చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. తాజాగా మరో ఎమ్మెల్యే టీడీపీకి గుడ్బై చెప్పబోతున్నారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీని వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12.30గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలవనున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బాటలోనే గణేష్ వైసీపీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా 2009లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన వాసుపల్లి గణేష్ ఓడిపోయారు. ఆ తరువాత 2014, 2019లో మళ్లీ టీడీపీ నుంచి గెలిచారు. ఇక గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
Read More:
మంత్రి ఈటెల ‘పేషీ’లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్
కరోనా అప్డేట్స్: తెలంగాణలో 2,123 కొత్త కేసులు.. జీహెచ్ఎంసీలో ఎన్నంటే