“కుప్పంలో కేజీ పప్పు ఇచ్చావా బాబూ”

టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. క‌ష్ట స‌మ‌యంలో బాబు త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గంలో కేజీ కందిపప్పు కూడా పంచలేదని ఆరోపించారు. కుటుంబంతో క‌లిసి హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబుకి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను విమర్శించే హక్కు లేద‌ని మండిప‌డ్డారు. క‌రోనా టెస్టులపై అనుమానం ఉంటే వచ్చి ఏపీలో చెక్ చేసుకోవాలని సూచించారు. ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తోన్న‌ టీడీపీకి చెందిన నేతలు […]

కుప్పంలో కేజీ పప్పు ఇచ్చావా బాబూ
Follow us

|

Updated on: Apr 19, 2020 | 11:46 AM

టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. క‌ష్ట స‌మ‌యంలో బాబు త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గంలో కేజీ కందిపప్పు కూడా పంచలేదని ఆరోపించారు. కుటుంబంతో క‌లిసి హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబుకి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను విమర్శించే హక్కు లేద‌ని మండిప‌డ్డారు.

క‌రోనా టెస్టులపై అనుమానం ఉంటే వచ్చి ఏపీలో చెక్ చేసుకోవాలని సూచించారు. ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తోన్న‌ టీడీపీకి చెందిన నేతలు కరోనా పరీక్షలు చేయించుకుంటే గ‌వ‌ర్న‌మెంట్ కేసులు దాచిపెట్టిందో లేదో క్లారిటీ వస్తుందన్నారు. కుప్పం, మంగళగిరి ప్రజలు కష్టాల్లో ఉంటే.. వారిని గాలికొదిలేసి బాబు, ఆయన త‌న‌యుడు హైదరాబాద్‌లో బిజినెస్ చేసు​కుంటున్నారని విమర్శించారు.