ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి వ్యవహారం.. మద్రాస్ హైకోర్టుకు ప్రభు
చెన్నైలో వివాదంగా మారిన ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి వ్యవహారం కోర్టుకెక్కింది. ప్రభు తన కుమార్తెను బలవంతపు వివాహం చేసుకున్నారని
MLA Prabhu marriage issue: చెన్నైలో వివాదంగా మారిన ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి వ్యవహారం కోర్టుకెక్కింది. ప్రభు తన కుమార్తెను బలవంతపు వివాహం చేసుకున్నారని సౌందర్య తండ్రి స్వామినాథన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమార్తెను బెదిరించి వివాహం చేసుకున్నారని, సౌందర్యను తమకు అప్పగించాలని స్వామినాథన్ ఆ పిటిషన్లో వెల్లడించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రభు, సౌందర్యలు నేరుగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ప్రభు, ఆయన భార్య సౌందర్య కోర్టుకు హాజరయ్యారు. దీనిపై విచారణ ప్రారంభం అయ్యింది. అయితే గత వారంలో సౌందర్యను ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఎమ్మెల్యే ప్రభు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగినట్లు మొదట వార్తలు వచ్చినా.. సౌందర్య కుటుంబసభ్యులు ఆ విషయాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో సౌందర్య తండ్రి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తన అంగీకారంతోనే ఈ వివాహం చేసుకున్నట్లు సౌందర్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Read More:
Official: బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రివీల్.. ప్రభాస్ మూవీలో బిగ్బీ