రంగంలోకి బాలయ్య…అమరావతి గ్రామాల్లో పర్యటన
ఏపీలో అమరావతి వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఆ ప్రాంత రైతులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికి 28 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో తమ వేదనను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..రాజధాని గ్రామాల్లో కనుమ రోజున పర్యటించనున్నారు. ఆయనతో పాటు భార్య వసుంధర, కుమార్తె బ్రహ్మణి కూడా రాజధాని రైతులకు తమ మద్దతును తెలియజేయనున్నారు. తుళ్లూరుతో పాటు వెలగపూడి, మందడం గ్రామాల్లో ఉన్న రైతుల నిరాహార దీక్ష శిబిరాలను బాలకృష్ణ సందర్శించనున్నారు. కాగా […]
ఏపీలో అమరావతి వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఆ ప్రాంత రైతులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికి 28 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో తమ వేదనను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..రాజధాని గ్రామాల్లో కనుమ రోజున పర్యటించనున్నారు. ఆయనతో పాటు భార్య వసుంధర, కుమార్తె బ్రహ్మణి కూడా రాజధాని రైతులకు తమ మద్దతును తెలియజేయనున్నారు. తుళ్లూరుతో పాటు వెలగపూడి, మందడం గ్రామాల్లో ఉన్న రైతుల నిరాహార దీక్ష శిబిరాలను బాలకృష్ణ సందర్శించనున్నారు.
కాగా ఒక్కొక్కరిగా సినీ నటులు అమరావతికి తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే అగ్ర నిర్మాత అశ్వనీదత్, హీరో నారా రోహిత్, సింగర్ స్మిత, దర్శకుడు సతీశ్ వేగేశ్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. తాజాగా బాలయ్య కూడా రంగంలోకి దిగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు బాలకృష్ణ రైతుల పక్షాన పోరాడేందకు రాకపోవడం, కనీసం మద్దతు తెలపకపోవడంతో పలువురు పెదవి విరిచారు. తాజా పర్యటనలో ఆయన వారికి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.