బాబు బినామీలే రాజధానిపై దొంగ ధర్నాలు చేస్తున్నారు: ఆళ్ల
చంద్రబాబు బినామీలే రాజధానిలో దొంగ ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అమరావతిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే బాబు బినామీలు, రైతుల ముసుగులో ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులు దొంగ ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధానిలో పర్యటిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు.. రైతుల్లో అనుమానాలు రేకెత్తించవద్దని ఆయన సూచించారు. రాజధాని ఇక్కడ కాబట్టే తమ నేత, ముఖ్యమంత్రి జగన్ సొంత నివాసాన్ని తాడేపల్లిలో కట్టుకున్నారని ఆయన అన్నారు. రాజధానిని మారుస్తున్నట్లు ఎవరు చెప్పారని […]
చంద్రబాబు బినామీలే రాజధానిలో దొంగ ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అమరావతిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే బాబు బినామీలు, రైతుల ముసుగులో ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులు దొంగ ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధానిలో పర్యటిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు.. రైతుల్లో అనుమానాలు రేకెత్తించవద్దని ఆయన సూచించారు.
రాజధాని ఇక్కడ కాబట్టే తమ నేత, ముఖ్యమంత్రి జగన్ సొంత నివాసాన్ని తాడేపల్లిలో కట్టుకున్నారని ఆయన అన్నారు. రాజధానిని మారుస్తున్నట్లు ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఇక గతంలో రాజధాని నిర్మాణం కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ బేతపూడి రైతులు చేసిన ఆందోళనకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడానికి తాను వ్యతిరేకమని, అవసరమైతే నిరాహారదీక్షలు చేస్తానని నాడు చెప్పిన పవన్, తరువాత అడ్రస్ లేకుండా పోయారని విమర్శలు గుప్పించారు.