కృష్ణా, గోదావరి డెల్టా కాల్వల ఆధునికీకరణ లక్ష్యం..సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ మిషన్ ఫర్ క్లిన్ గోదావరి-కృష్ణా కెనాల్కు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటు జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలోని కృష్ణా, గోదావరి డెల్టాల ఆధునికీకరణ లక్ష్యంగా కమిటీల కార్యాచరణ రూపొందించింది. ఆయా ప్రాంతాలలోని కాలువలను శుభ్రపరచడంతో పాటు సుందరీకరణ చేయడం టార్గెట్ గా కమిటీలకు మార్గనిర్దేశకాలు విడుదల చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. జల వనరుల శాఖ, […]
ఆంధ్రప్రదేశ్ మిషన్ ఫర్ క్లిన్ గోదావరి-కృష్ణా కెనాల్కు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటు జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలోని కృష్ణా, గోదావరి డెల్టాల ఆధునికీకరణ లక్ష్యంగా కమిటీల కార్యాచరణ రూపొందించింది. ఆయా ప్రాంతాలలోని కాలువలను శుభ్రపరచడంతో పాటు సుందరీకరణ చేయడం టార్గెట్ గా కమిటీలకు మార్గనిర్దేశకాలు విడుదల చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. జల వనరుల శాఖ, ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్లు, పురపాలక, పంచాయతీ రాజ్ కమిషనర్లు మెంబర్స్ గా 9 మందితో టాస్క్ పోర్స్ కమిటీని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.