గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన మిస్ యునివర్సల్ ఊర్వశి
తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో యంగ్ హీరోయిన్, మిస్ యూనివర్సల్ ఊర్వశి రాహుటేలా పాల్గొన్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి.. జూబ్లిహిల్స్లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఊర్వశి. ఈ సందర్బంగా ఆమె మాట్లడుతూ.. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను పూర్తి చేయించడం జరుగుతుంది.
తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో యంగ్ హీరోయిన్, మిస్ యూనివర్సల్ ఊర్వశి రాహుటేలా పాల్గొన్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి.. జూబ్లిహిల్స్లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఊర్వశి. ఈ సందర్బంగా ఆమె మాట్లడుతూ.. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్కి అభినందనలు తెలియజేశారు. ప్రముఖ నటులు ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ లాంటి ప్రముఖులు పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నేను కూడా పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.
Actress @UrvashiRautela accepted #GreenindiaChallenge ? given@iamsampathnandi and planted saplings.
Requested everyone to self nominate for this great cause and thanked #Prabhas, @urstrulyMahesh and @actorvijay for inspiring. ? Appreciated @MPsantoshtrs for the efforts. pic.twitter.com/BQdxZMHw7O
— BARaju (@baraju_SuperHit) August 23, 2020
Read More:
వాట్సాప్లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్కట్తో పాటు!
ఖైరతాబాద్లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ