‘మీర్జాపూర్-2’ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో క్రైమ్ జోనర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు వాటిపై మంచి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలాంటి క్రైమ్ స్టోరీతో రూపొందిందే 'మీర్జాపూర్'.
ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో క్రైమ్ జోనర్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు వాటిపై మంచి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలాంటి క్రైమ్ స్టోరీతో రూపొందిందే ‘మీర్జాపూర్’. అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజైన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీని ఫస్ట్ సీజన్ హిట్ కావడం వల్ల రెండో సీజన్పై ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగింది. కాగా ఈ కొత్త సిరీస్ రిలీజ్పై సదరు ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అక్టోబరు 23 నుంచి ప్రైమ్లో ‘మీర్జాపూర్’ రెండో సీజన్ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రకటించింది.
స్టోరీ ఏంటంటే
యూపీలోని మీర్జాపూర్ అనే ఏరియాలో అఖండానంద్ అనే మాఫియా డాన్ ఉంటాడు. అక్కడ ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనం. అలాంటి వ్యక్తి కుమారుడైన మున్నాకు.. ఓ చెట్టుకింద ప్లీడర్, ఆయన తనయులు గుడ్డు, బబ్లూ మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ‘మీర్జాపూర్’ స్టోరీ. అలీ ఫజల్, విక్రాంత్ మాసే, దివ్యేందు శర్మ, పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్లో పోషించారు. ఈ క్రైమ్ థిల్లర్ వెబ్సిరీస్కు కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. తొలి సీజన్ హిట్టవ్వడంతో, రెండో సీజన్ తెరకెక్కించారు.
Read More :
ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన సర్కార్