మరో తెలంగాణ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. రెండు రోజుల కిందట నుంచి ఆయన జ్వరం, జలుబు, దగ్గు వంటి..
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. రెండు రోజుల కిందట నుంచి ఆయన జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ రిపోర్ట్స్లో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆయన మిర్యాలగూడలోని తన ఇంట్లోనే స్వీయ నిర్భందంలోనే ఉన్నారు.
కాగా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క హైదరాబాద్లోనే 796 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,342కి చేరింది. ఇందులో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ నుంచి 25,999 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే నిన్న 11 మంది కరోనాతో మృతిచెందగా.. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 386కి చేరింది.
Read More:
ప్రపంచ వ్యాప్తంగా టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే?