బ్రేకింగ్ : నిర్భయ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ రోజు ఉరి డౌటే..!
నిర్భయ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈనెల 22న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసే అవకాశం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. క్షమాభిక్ష పిటిషన్, ఉరిశిక్ష అమలు మధ్య.. కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారుల తీరుపై మండిపడింది. క్షమాభిక్ష పిటిషన్ను పంపడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. దీనిపై జైలు అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.
నిర్భయ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈనెల 22న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసే అవకాశం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. క్షమాభిక్ష పిటిషన్, ఉరిశిక్ష అమలు మధ్య.. కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారుల తీరుపై మండిపడింది. క్షమాభిక్ష పిటిషన్ను పంపడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. దీనిపై జైలు అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.