ఖమ్మం అత్యాచార ఘటన.. మైనర్ బాలిక మృతి

ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక మృతి చెందింది. హైదరాబాద్‌లోని ఓ‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి తాజాగా కన్నుమూసింది

ఖమ్మం అత్యాచార ఘటన.. మైనర్ బాలిక మృతి
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2020 | 7:46 AM

Khammam minor girl: ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక మృతి చెందింది. హైదరాబాద్‌లోని ఓ‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి తాజాగా కన్నుమూసింది. గత నెలలో యువతిపై అత్యాచారం చేసిన ఓ యువకుడు ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. అందులో యువతి తీవ్రంగా గాయపడగా.. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించి గోప్యంగా చికిత్స అందజేశారు. అయితే బాలిక పరిస్థితి విషమించడంతో ఆ తరువాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా.. ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్న ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Read More:

Bigg Boss 4: ఓల్డ్‌ మెమోరీస్‌.. ఏడుస్తూ ఏడ్పించిన కంటెస్టెంట్లు

తంగేడుప‌ల్లి మేజ‌ర్‌ కాల్వ‌లో కారు బోల్తా.. నలుగురు జలసమాధి