ఖమ్మం అత్యాచార ఘటన.. మైనర్ బాలిక మృతి
ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక మృతి చెందింది. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి తాజాగా కన్నుమూసింది
Khammam minor girl: ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక మృతి చెందింది. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి తాజాగా కన్నుమూసింది. గత నెలలో యువతిపై అత్యాచారం చేసిన ఓ యువకుడు ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. అందులో యువతి తీవ్రంగా గాయపడగా.. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించి గోప్యంగా చికిత్స అందజేశారు. అయితే బాలిక పరిస్థితి విషమించడంతో ఆ తరువాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా.. ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్న ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Read More:
Bigg Boss 4: ఓల్డ్ మెమోరీస్.. ఏడుస్తూ ఏడ్పించిన కంటెస్టెంట్లు