కూకట్ పల్లిలో దారుణం.. స్నేహం ముసుగులో అత్యాచారం…

దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. క్రైమ్ కేసులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది.

కూకట్ పల్లిలో దారుణం.. స్నేహం ముసుగులో అత్యాచారం...
Follow us

|

Updated on: Oct 16, 2020 | 8:05 AM

దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. క్రైమ్ కేసులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. కూకట్ పల్లిలో బర్త్ డే పార్టీకి పిలిపించి ఓ మైనర్ బాలకపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ముగ్గురు స్నేహితలు. ఈ దారుణానికి ఒడిగిగట్టింది కూడా ముగ్గురు మైనర్ బాలురు. ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన జోసెఫ్, రాము, నవీన్ ముగ్గురు మైనర్లుస్నేహంగా ఉండేవారు. ఇదే క్రమంలో బర్త్ డే పార్టీ ఉందని బాలికను కూకట్ పల్లికి పిలిపించి మత్తు మందు కలిపిన కేక్ ను తినిపించారు. అనంతరం ముగ్గురు మైనర్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే, ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం అసలు విషయం బయటపెట్టింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోసెఫ్, రాము, నవీన్ అనే ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.