సర్దార్ సర్వాయి పాపన్న కోటను సందర్శించిన మంత్రి

సర్దార్ సర్వాయి పాపన్న స్వయంగా నిర్మించిన సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి కోట.. నిన్న, మొన్నటి వర్షాలకి పాక్షికంగా కూలిపోవడంతో హుటా హుటినా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోటను సందర్శించారు.

సర్దార్ సర్వాయి పాపన్న కోటను సందర్శించిన మంత్రి
Follow us

|

Updated on: Oct 16, 2020 | 7:56 PM

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జనగాం జిల్లాలో పర్యటించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గోడ కూలి పోవడంతో హుటాహుటినా మంత్రి కోట సందర్శనకు బయల్దేరారు. పర్యాటక, పురావస్తు, ఇతర శాఖల అధికారులతో కోటను పరిశీలించారు.

జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో వున్నా సర్దార్ సర్వాయి పాపన్న స్వయంగా నిర్మించిన సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి కోట నిన్న, మొన్నటి వర్షాలకి పాక్షికంగా కూలిపోవడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం పక్షాన వెళ్లి పరిశీలించారు. రాష్ట్ర పర్యాటక,పురావస్తు జిల్లా కలెక్టర్ నిఖిల,ఎంపి దయాకర్,స్థానిక ఎమ్మెల్యే రాజయ్యలతో కలిసి కోటలో క్షుణ్ణంగా కలియ తిరిగారు. కూలిపోయిన గోడను పరిశీలించి అధికారులకి తగు సూచనలు చేశారు. తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

పాపన్న బహుజనుల కోసం పోరాటం చేసిన యోధుడు అయన పోరాట ప్రతీకలైన కోటలను గత పాలకులు విస్మరించారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక సీయం కేసీఆర్ పాపన్న నిర్మించిన కోటను రక్షించాలని నిర్ణయించారని అన్నారు. చరిత్ర కల్గిన ఈ ప్రాంతాన్ని పరిరక్షించే భద్యత ఈ ప్రభుత్వంపై ఎంతైనా వుందనే సంకల్పంతోనే మన ముఖ్యమంత్రి కోటను పూర్తిస్థాయిలో మరమత్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఇకా కోట గోడ కూలి నష్టపోయిన ఇండ్ల వారికి పునరావాస ఏర్పాట్లు చేశామని, వారికి ప్రభుత్వం అండగా వుందని బాధితులకు బారోస నింపారు. ఈ సందర్బంగా నష్టపోయిన బాధితులు మంత్రితో తమ గోడును వెళ్లబోసుకున్నారు.