ఇక టెక్స్టైల్ హబ్గా ఆంధ్రప్రదేశ్: మంత్రి మేకపాటి
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంక్షేమ పథకాల అమలుతో జగన్ దూసుకెళుతున్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంక్షేమ పథకాల అమలుతో జగన్ దూసుకెళుతున్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఏపీని టైక్స్టైల్ హబ్గా మారుస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
‘ఇన్వెస్ట్ ఇండియా ఫోరమ్ వెబినార్’లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వస్త్ర తయారీ పరిశ్రమలకు నెలవైన ఏపీలో ‘టోరె’ సహా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయన్నారు. కరోనా విజృంభిస్తూ ఆర్థిక ఇబ్బందులున్న సమయంలోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. చేనేత రంగానికి సంబంధించిన బకాయిలను (సుమారు రూ.1300కోట్లు) ఈ ఏడాది చెల్లించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఏపీలో 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసి, ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవ వనరులను సృష్టిస్తామని తెలిపారు. చేనేత రంగానికి ప్రభుత్వం అన్ని విధాల బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నిరంగాలలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను శాశ్వత గమ్యస్థానంగా మార్చుతామని, నియమనిబంధనలు పాటిస్తూనే వాణిజ్యాన్ని విస్తరించే చర్యలు చేపడుతున్నాం.’ అని వెబినార్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: ఇన్స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు