తెలంగాణ నూతన ఎల‌క్ట్రిక్ వెహి‌కిల్‌ పాల‌సీ విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రూపొం‌దిం‌చిన నూతన ఎల‌క్ట్రిక్ వెహి‌కిల్‌ (ఈవీ) పాల‌సీని రాష్ట్ర ఐటీ, పరి‌శ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్, రవా‌ణా‌శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంయుక్తంగా శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు.

తెలంగాణ నూతన ఎల‌క్ట్రిక్ వెహి‌కిల్‌ పాల‌సీ విడుదల
Follow us

|

Updated on: Oct 30, 2020 | 1:39 PM

వాహన కాలు‌ష్యాన్ని తగ్గిం‌చ‌డంలో భాగంగా ప్రభుత్వం ఎల‌క్ట్రిక్ వాహ‌నా‌లను ప్రోత్స‌హి‌స్తోంది. ఇందు‌కోసం రాష్ట్రం‌లోనే తయారీ యూనిట్లు, చార్జింగ్‌ పాయిం‌ట్లను పెట్టేలా పారి‌శ్రా‌మి‌క‌వే‌త్త‌లను ప్రోత్స‌హిం‌చా‌లని నిర్ణ‌యిం‌చింది. ప్రజలు ఎక్కు‌వగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొను‌గోలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం రాయి‌తీ‌లను ప్రక‌టిం‌చింది. రాష్ర్ట ప్రభుత్వం రూపొం‌దిం‌చిన నూతన ఎల‌క్ట్రిక్ వెహి‌కిల్‌ (ఈవీ) పాల‌సీని రాష్ట్ర ఐటీ, పరి‌శ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్, రవా‌ణా‌శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంయుక్తంగా శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని మర్రి చెన్నా‌రెడ్డి మానవ వన‌రుల కేంద్రంలో తెలం‌గాణ ఈవీ సమ్మి‌ట్‌లో పాల‌సీ విధానాన్ని మంత్రులు ప్ర‌క‌టించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహ‌నాల హ‌బ్‌గా మార్చాల‌న్న ల‌క్ష్యంతో ఈ నూత‌న విధానాన్ని తీసుకువచ్చిన్నట్లు మంత్రి కేటీ.రామారావు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహ‌నాలు, ఇంధ‌న నిల్వ‌ల‌కు కొత్త విధానం అమ‌లు చేయ‌నుంది రాష్ట్ర ప్రభుత్వం. 2020-2030 వ‌ర‌కు ఎలక్ట్రిక్ వాహ‌నాల త‌యారీ, వినియోగంపై విధి విధానాలపై మంత్రి ప్ర‌క‌ట‌న చేశారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల నూతన విధానం అద్భుతంగా విజయవంతం కాబోతుందని.. ఈ వాహనాలకు హబ్‌గా తెలంగాణను మార్చబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయని అన్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో భూములు అందుబాటులో ఉన్నాయని.. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ అందుబాటులో ఉందని.. సరిగా వినియోగించుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్‌ విధానం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను భవిష్యత్‌లో మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేటీఆర్‌ వివరించారు.

రాష్ట్రంలో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప‌లు రాయితీలను కల్పిస్తున్నారు. ఈ విధానం అమ‌లుకు ఉన్న‌తాధికారుల‌తో నిర్వాహ‌క క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్నారు. ఇప్పటికే ఆయా ప‌రిశ్ర‌మ‌లు, మెగా ప్రాజెక్టులు రూ. 200 కోట్ల‌కు మించి పెట్టుబడులు పెట్ట‌డం జ‌రిగింది. పెట్టుబ‌డి మొత్తంలో మెగా ప్రాజెక్టుల‌కు 25 శాతం రాయితీ క‌ల్పించ‌నున్నారు. విద్యుత్ ఛార్జీలు, స్టాంపు, రిజి స్ట్రేషన్ ఫీజుల‌పై రాయితీలు ఇవ్వ‌నున్నారు.

మొద‌టి 2 ల‌క్ష‌ల ద్విచ‌క్ర వాహ‌నాల‌కు ర‌హ‌దారి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌నున్నారు. 5 వేల ఫోర్ వీల‌ర్లు, 10 వేల లైట్ గూడ్స్‌, క్యారియ‌ర్‌ల‌కు పూర్తిగా ప‌న్ను రద్దు చేయ‌నున్నారు. ప్ర‌జా ర‌వాణాలోనూ ఎలక్ట్రిక్ వాహ‌నాల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం క‌స‌ర‌త్తులు మొదలు పెట్టింది. పార్కింగ్‌, ఛార్జింగ్ స‌మ‌స్య‌ల‌కు పరిష్కార మార్గాలు వెత‌క‌నున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేసి ప్ర‌త్యేక రుసుములు వ‌సూలు చేయ‌నున్నారు. జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌తి 50 కిలోమీట‌ర్ల‌కు ఒక ఛార్జింగ్ స్టేష‌న్ ఏర్పాటు చేయ‌నున్నారు.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు