ప‌్ర‌పంచం మెచ్చిన భాగ్యనగరం..: మంత్రి కేటీఆర్

రాష్ర్ట ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో హైద‌రాబాద్‌ది కీల‌క పాత్ర అని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలో అనేక నూత‌న కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీ నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వెల్లడించారు.

ప‌్ర‌పంచం మెచ్చిన భాగ్యనగరం..: మంత్రి కేటీఆర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 2:31 PM

ప‌్ర‌పంచం మెచ్చిన గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ న‌గ‌రం అవ‌త‌రిస్తోంద‌ని రాష్ర్ట ఐటీ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో మంత్రి కేటీఆర్ స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ర్ట ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ‌లో అత్యంత వేగంగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ చెందింద‌ని వెల్లడించారు.

తెలంగాణ రాష్ర్ట ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో హైద‌రాబాద్‌  కీల‌క పాత్ర అని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలో అనేక నూత‌న కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం జరిగిందని గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీ నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వెల్లడించారు. ట్రాఫిక్ ర‌ద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు నిర్మించామ‌న్నారు.

రాబోయే రోజుల్లో మెట్రో వ్యవస్థను మ‌రింత విస్త‌రిస్తామన్నారు. అన్ని పుర‌పాలిక‌ల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం పాటుప‌డుతుంద‌న్నారు. రూపాయికే ఇంటింటికీ న‌ల్లా క‌నెక్ష‌న్ ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశామ‌ని తెలిపారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను ఎదుర్కొనేందుకు డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేశామ‌న్నారు.

బ‌స్తీల్లో పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యాన్ని అందించేందుకు బ‌స్తీ ద‌వ‌ఖానాలు ఏర్పాటు చేశామ‌న్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రాష్ర్ట ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంపింగ్ యార్డు వ‌ద్ద విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్లాంట్‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.