ఓపెన్ నాలాలపైకప్పు నిర్మాణం చేపట్టండి: కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలోని ఓపెన్ నాలాలపై క్యాపింగ్ (బాక్స్ డ్రైనేజీలు) నిర్మాణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కేటీ. రామారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని ఓపెన్ నాలాలపై క్యాపింగ్ (బాక్స్ డ్రైనేజీలు) నిర్మాణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్ కార్యక్రమాలు పూర్తి చేయాలని.. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.300కోట్లు ఖర్చు అవుతాయని.. వీటన్నిటికీ త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. రెండు మీటర్ల కన్నా వెడల్పు ఉన్న నాళాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
MA&UD Minister @KTRTRS reviewed the impact of the heavy rains in Hyderabad city and other Urban Local Bodiess in the State. Minister instructed the officials to take all necessary precautions and also step up relief measures where required. pic.twitter.com/ADvSxquIrl
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 21, 2020