కేంద్ర విధానాల వల్లే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది… హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో బీజేపీపై విమర్శలు
కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. నోట్ల రద్దు, కరోనాతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రకటిస్తే ఒక్క రూపాయి కూడా అదలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Minister KTR : కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. నోట్ల రద్దు, కరోనాతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రకటిస్తే ఒక్క రూపాయి కూడా అదలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మారియట్ కన్వెన్షన్ సెంటర్లో “హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రసంగించారు. కరోనా వాణిజ్యంతో పాటు అనేక రంగాలను దెబ్బతీసిందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక మంది వ్యాపారవేత్తలు విరాళాలిచ్చారు. నోట్ల రద్దు చిరువ్యాపారులను దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. కేంద్రం విధానాల కారణంగానే 8 వరుస త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించిందని విమర్శించారు.
తెలంగాణ రాకముందు విద్యుత్ కోసం ఇందిరా పార్కు వద్ద ధర్నాలు జరిగేవని… తను చదువుకునే రోజుల్లో హైదరాబాద్లో కర్ఫ్యూలతో సెలవులు ఇచ్చేవారు అని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరగంట కూడా కర్ఫ్యూ పెట్టలేదు అన్నారు. హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వివరించారు.
హైదరాబాద్ నలువైపులా షాపింగ్ మాల్స్ వచ్చాయని వివరించారు. ఉప్పల్లో ఐదు ఐటీ పార్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీని తీసుకువచ్చామన్నారు. ఓఆర్ఆర్ వెలుపల నిర్మించే టౌన్షిప్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.