లాక్డౌన్ ఎఫెక్ట్: కేంద్రమంత్రికీ తప్పని కరోనా కష్టాలు..
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికీ కరోనా లాక్ డౌన్ కష్టాలు తప్పడం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికీ కరోనా లాక్ డౌన్ కష్టాలు తప్పడం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకాన్ని సోదరులు, బంధువులతో కలిసి కిషన్రెడ్డి నిర్వహించారు. కరోనా పర్యవేక్షణ బాధ్యతల కారణంగా గత నెల రోజులుగా కిషన్రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న తాను స్వయంగా లాక్ డౌన్ నియమాన్ని ఉల్లంఘించదలుచుకోలేదని కిషన్రెడ్డి తెలిపారు. నేడు ఢిల్లీలోని తన నివాసంలో తల్లి సంవత్సరీకాన్ని కిషన్రెడ్డి ఒంటరిగా నిర్వహించారు. భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి, మంత్రి ఢిల్లీ నుంచి ఆన్లైన్లో సంవత్సరికాన్ని పూర్తి చేశారు.
Also Read: లాక్డౌన్ నేపథ్యంలో.. సజీవంగా సూట్ కేసులో..!