కాళేశ్వరానికి అవినీతి అంటగడతారా..? అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్ కళ్లు మండుతున్నాయన్న మంత్రి జగదేశ్రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించడంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక..
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించడంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్ కళ్లు మండుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ పురోగతిని కేంద్ర మంత్రులు సైతం ప్రశంసించారని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు శాపంగా మారిన ఫ్లోరైడ్ భూతాన్ని తరికొట్టామని మంత్రి జగదీష్రెడ్డి వెల్లడించారు. ప్రజలు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి విమర్శించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే తమకు అడ్రస్ ఉండదని కేసులు వేసి అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ స్కాంల వల్లనే దేశం ఎంతో నష్టపోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాగు, తాగునీటికి సమస్యలు ఉండేవని చెప్పారు.
దేశంలో తెలంగాణ అన్నిరంగాల్లో నంబర్ 1గా మారిందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లారాజేశ్వర్రెడ్డి తెలిపారు. తెలంగాణలో అభివృద్ధిని జీర్ణించుకోలేకనే కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ అవినీతి రంగు పులుముతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్థికవృద్ధిరేటులో 14.2 శాతంతో తెలంగాణ మూడోస్థానంలో ఉందని వివరించారు.