బ్రేకింగ్‌.. దీదీ కేబినెట్‌లో కలకలం.. రీజన్‌ ఇదే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పటికే లక్షా అరవఐ వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా.. రాజకీయ నాయకులకు, పోలీసులకు, వైద్యులకు కూడా సోకుతోంది. ఇప్పటికే.. మహారాష్ట్రలోని పలువురు మంత్రులకు కరోనా సోకడంతో.. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. వెస్ట్ బెంగాల్‌లోని మమతా సర్కార్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది. దీదీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సుజిత్ బోస్‌కు […]

బ్రేకింగ్‌.. దీదీ కేబినెట్‌లో కలకలం.. రీజన్‌ ఇదే..
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 1:24 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పటికే లక్షా అరవఐ వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా.. రాజకీయ నాయకులకు, పోలీసులకు, వైద్యులకు కూడా సోకుతోంది. ఇప్పటికే.. మహారాష్ట్రలోని పలువురు మంత్రులకు కరోనా సోకడంతో.. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా.. వెస్ట్ బెంగాల్‌లోని మమతా సర్కార్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది. దీదీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సుజిత్ బోస్‌కు కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. దీంతో.. దీదీ కేబినెట్‌లో కరోనా టెన్షన్‌ మొదలైంది. మంత్రికి కరోనా సోకడంతో.. హోం క్వారంటైన్‌ పాటించాల్సిందిగా డాక్టర్లు సూచించారు. మంత్రి కుటుంబ సభ్యలకు కూడా కరోనా పరీక్షలు చేయడంతో.. మంత్రి సుజిత్ బోస్‌ భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇంకా మిగతా కుటుంబ సభ్యులతో పాటు.. ఇతర వ్యక్తుల శాంపిల్స్‌ను కూడా పరీక్షలకు పంపించినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.