బాబు ఇంకా పుడుంగి అనుకుంటున్నారు: బొత్స సెటైర్లు

రాజధాని అమరావతి ప్రాజెక్ట్ విషయంలో సింగపూర్ ప్రతినిధులు ఎందుకు వైదొలిగారన్న దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టతను ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన బొత్స.. రాజధానిపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత సింగపూర్ ప్రతినిధులు రెండు, మూడు సార్లు తనను, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారని బొత్స తెలిపారు. ఆ సందర్భంగా తాము వారిని ప్రత్యేకంగా ఏమీ కోరలేదని.. కానీ సంపద ఎలా […]

బాబు ఇంకా పుడుంగి అనుకుంటున్నారు: బొత్స సెటైర్లు
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 6:52 PM

రాజధాని అమరావతి ప్రాజెక్ట్ విషయంలో సింగపూర్ ప్రతినిధులు ఎందుకు వైదొలిగారన్న దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టతను ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన బొత్స.. రాజధానిపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత సింగపూర్ ప్రతినిధులు రెండు, మూడు సార్లు తనను, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారని బొత్స తెలిపారు. ఆ సందర్భంగా తాము వారిని ప్రత్యేకంగా ఏమీ కోరలేదని.. కానీ సంపద ఎలా సృష్టిస్తారో చెప్పాలని మాత్రమే అడిగామని, అది తమకు నచ్చితే ముందుకు వెళ్తామని చెప్పామని పేర్కొన్నారు. అయితే ఆ ప్రశ్నకు వారి వద్ద నుంచి సరైన సమాధానం లేదని, దీంతో పరస్పర అంగీకారంతోనే వారు ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగినట్లు తెలిపారు. అమరావతి ప్రాజెక్ట్‌పై సింగపూర్ ప్రతినిధులతో జరిగిందేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదే విషయంపై కావాలంటే సింగపూర్ ప్రతినిధులను తీసుకువచ్చి అడగొచ్చని.. ఈ ప్రాజెక్ట్‌పై తాము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే దేనికైనా ఒప్పుకుంటామని బొత్స సవాల్ విసిరారు. రాజధానిపై టీడీపీ నేతలకు ఇంతకన్నా ఇంకేం అర్థం కావాలని ఆయన ప్రశ్నించారు. అమరావతి ప్రాజెక్ట్‌పై ఓసారి ఎంవోయూ అంటూ, మరోసారి స్విస్ ఛాలెంజ్ అంటూ టీడీపీ నేతలు మాటలు మారుస్తున్నారని, అసలు ఒక్క మాట మీద నిలబడటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బొత్స విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రానికి బాబు ముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల ధౌర్భాగ్యమని, ఈయన చేసిన పనులకు ప్రజలు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని విమర్శించారు. కానీ ఆయన మాత్రం ఇంకా తాను పుడుంగి అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..