ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి బొత్స..అందుకే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని వెల్లడి

ఏపీలో పేద ప్రజలకు రేపు పండుగ రోజన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి దాదాపు 35 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి బొత్స..అందుకే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని వెల్లడి
Follow us

|

Updated on: Dec 24, 2020 | 8:14 PM

Distribute Houses : ఏపీలో పేద ప్రజలకు రేపు పండుగ రోజన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి దాదాపు 35 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు. 15 లక్షల ఇళ్ల పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రెండు వారాలపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం జగన్‌ తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ప్రారంభిస్తారని వెల్లడించారు.

విశాఖలోనే 1350 కోట్ల విలువైన 4457 ఎకరాలు పంపిణీ చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల కోట్ల విలువైన 68 వేల 300 ఎకరాలు పేదలకు ఇస్తున్నట్లు వివరించారు. 4 లక్షల మంది సొంత స్థలం వున్న వారికి లక్షా 80 వేల ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. పేదరికమే ప్రాతిపదికగా ఇళ్ల పట్టాలను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు బొత్స. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో మహత్తర ఘట్టమన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మనుషులు కోర్టులకు వెళ్లడం వల్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమైందని బొత్స విమర్శించారు. భూ సర్వే చేస్తే భూ దోపిడీ అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండిపోవాలా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..