విశాఖ వాసులకు గుడ్ న్యూస్..మెట్రో రైలు వచ్చేస్తుంది
విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పాలనా రాజధానిగా ఎదుగుతున్న వైజాగ్లో ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పారు.
విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పాలనా రాజధానిగా ఎదుగుతున్న వైజాగ్లో ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పారు. విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా? ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోవాలా? అనే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ రెడీ అవుతుందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స వెల్లడించారు. విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల మేర మెట్రో రూట్ నిర్మిస్తామని వివరించారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. కాగా విశాఖలో 79.91 కిలో మీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్, 60.29 కిలో మీటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Also Read :
యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ డిశ్చార్జ్
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ