ఎటు చూసిన చైనానే..బొక్కబోర్లాపడ్డ మోదీ: ఒవైసీ
ప్రధాని మోదీపై ఎంఐఎం అధినేత అసదుదద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేధికగా విమర్శలకు దిగారు. జైషే మహ్మద్ ఉగ్రనేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయించడంలో భారత్ ఘోర వైఫల్యం చెందిందంటూ ఒవైసీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. “మన సాయుధ దళాలు ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో చైనా మెటీరియల్ ఉంటుంది, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీపైనా చైనా ముద్ర ఉంది, ఇప్పుడు మసూద్ అజర్ […]
ప్రధాని మోదీపై ఎంఐఎం అధినేత అసదుదద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేధికగా విమర్శలకు దిగారు. జైషే మహ్మద్ ఉగ్రనేత మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయించడంలో భారత్ ఘోర వైఫల్యం చెందిందంటూ ఒవైసీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. “మన సాయుధ దళాలు ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో చైనా మెటీరియల్ ఉంటుంది, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీపైనా చైనా ముద్ర ఉంది, ఇప్పుడు మసూద్ అజర్ విషయంలోనూ చైనాదే పైచేయిగా నిలిచింది, విదేశాంగ విధానాల వైఫల్యంలో మాత్రం మోదీనే టాప్” అంటూ ట్వీట్ చేశారు.
Our bullet proof jackets: Chinese fingerprints Our Staue of Unity: Chinese fingerprints Masood Azhar’s designation as terrorist blocked: Chinese fingerprints.
Series of foreign policy disasters: Modiji’s fingerprintshttps://t.co/8azODq00OR
— Asaduddin Owaisi (@asadowaisi) March 14, 2019