బ్రేకింగ్.. నాసిక్లో భూప్రకంపనలు
మహారాష్ట్రలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంగళవారం మధ్యాహ్నం 2.54 గంటలకు నాసిక్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 2.2 మాగ్నిట్యూడ్గా..
మహారాష్ట్రలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మంగళవారం మధ్యాహ్నం 2.54 గంటలకు నాసిక్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 2.2 మాగ్నిట్యూడ్గా నమోదైంది. నాసిక్కు పడమరన 88 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
ఇదిలావుంటే.. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారీ వర్షాలు కూడా ముంబైలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. గతంలో కూడా పాల్ఘర్ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ఎలాంటి నష్టం జరగలేదు.
An earthquake of magnitude 2.2 occurred at 14:54:59 IST, 88 km west of Nashik, Maharashtra today: National Centre for Seismology pic.twitter.com/NrjOCn3cYd
— ANI (@ANI) August 18, 2020
Read More :