శ్రీలంకలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. ఒక్కరోజే 66 మంది భారతీయ వలస కూలీలకు పాజిటివ్

కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

శ్రీలంకలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. ఒక్కరోజే 66 మంది భారతీయ వలస కూలీలకు పాజిటివ్
Follow us

|

Updated on: Nov 14, 2020 | 3:09 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతుంది. ప్రముఖుల నుంచి సామాన్యుల దాకా వైరస్ ధాటికి విలవిలలాడుతున్నారు. బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలసకూలీలు కొవిడ్ కాటుకు గురవుతున్నారు. తాజాగా శ్రీలంకలో భవన నిర్మాణరంగంలో పనిచేసే 66 మంది భారతీయ కార్మికులు కరోనా బారిన పడ్డారు. దేశ రాజధాని కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు. ప్రస్తుతం ఈ 66 మంది దర్గా టౌన్‌లోని తాత్కాలిక వైద్య కేంద్రం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, శ్రీలంకలో ఈ చేపల మార్కెట్ క్లస్టర్ ఇప్పుడు కరోనా కేంద్రంగా మారిందని.. దేశంలో అత్యధిక కేసులు ఈ క్లస్టర్‌తోనే సంబంధం కలిగి ఉంటున్నాయని రువాన్ పేర్కొన్నారు. ఇక శుక్రవారం నాటికి శ్రీలంక వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15,722 నమోదైతే.. వీటిలో ఒక్క ఈ చేపల మార్కెట్ క్లస్టర్ పరిధిలో 9,120 మందికి కరోనా సోకడం గమనార్హం.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.