భూమిలో అర్థరాత్రి భారీ శబ్ధాలు.. భాగ్యనగర ప్రజలు కలవరం
అర్ధరాత్రి భారీ శబ్దాలు భాగ్యనగర వాసుల్ని ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ బోరబండ ప్రాంత వాసుల్ని భయపెట్టిన శబ్ధాలు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహడీ, ప్రాంతాల వాసుల్ని వణికిస్తున్నాయి. అర్ధరాత్రి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ఇంట్లో నుండి బయటికి పరుగులు తీశారు. భారీ శబ్దాలు వచ్చిన ప్రాంతాలను రాజేందర్ నగర్ ఎంఐఎం పార్టీ కంటెస్టెంట్స్ అభ్యర్థి మీర్జా రహిమత్ బేగ్ సందర్శించి ఇక్కడి ప్రజలకు […]
అర్ధరాత్రి భారీ శబ్దాలు భాగ్యనగర వాసుల్ని ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ బోరబండ ప్రాంత వాసుల్ని భయపెట్టిన శబ్ధాలు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహడీ, ప్రాంతాల వాసుల్ని వణికిస్తున్నాయి. అర్ధరాత్రి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ఇంట్లో నుండి బయటికి పరుగులు తీశారు. భారీ శబ్దాలు వచ్చిన ప్రాంతాలను రాజేందర్ నగర్ ఎంఐఎం పార్టీ కంటెస్టెంట్స్ అభ్యర్థి మీర్జా రహిమత్ బేగ్ సందర్శించి ఇక్కడి ప్రజలకు ధైర్యంగా ఉండాలని తెలిపారు. గతంలో కూడా ఇదేవిధంగా ఈ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.