ఈ పనిచేస్తే రూ.21 లక్షలు బహుమతి!
ఇంటర్నెట్ ఎంతో పెరిగిపోయిన ఈ కాలంలో – ఆన్లైన్ సెక్యూరిటీ అత్యంత ముఖ్యమైన విషయం. ఇంటర్నెట్ బ్రౌజర్ అనగానే ఫీచర్స్ మాత్రం గొప్పగా ఉంటే సరిపోదు. సెక్యూరిటీ అన్నిటికంటే ముఖ్యం. అందుకే ఇప్పుడు తన కొత్త క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్ని ఎలాంటి సమస్యలూ లేకుండా బగ్స్-ఫ్రీ గా చేయాలని సంకల్పించింది మైక్రోసాఫ్ట్ . గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ లతో పోటీ పడలేక ఇంతకాలం చతికిలబడ్డ తన ఎడ్జ్ బ్రౌజర్కి కొత్త క్రేజ్ తేవాలని చూస్తోంది. అందుకోసమే ఒక […]
ఇంటర్నెట్ ఎంతో పెరిగిపోయిన ఈ కాలంలో – ఆన్లైన్ సెక్యూరిటీ అత్యంత ముఖ్యమైన విషయం. ఇంటర్నెట్ బ్రౌజర్ అనగానే ఫీచర్స్ మాత్రం గొప్పగా ఉంటే సరిపోదు. సెక్యూరిటీ అన్నిటికంటే ముఖ్యం. అందుకే ఇప్పుడు తన కొత్త క్రోమియం ఎడ్జ్ బ్రౌజర్ని ఎలాంటి సమస్యలూ లేకుండా బగ్స్-ఫ్రీ గా చేయాలని సంకల్పించింది మైక్రోసాఫ్ట్ .
గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ లతో పోటీ పడలేక ఇంతకాలం చతికిలబడ్డ తన ఎడ్జ్ బ్రౌజర్కి కొత్త క్రేజ్ తేవాలని చూస్తోంది. అందుకోసమే ఒక ‘బగ్ బౌంటీ ప్రోగ్రామ్’ ప్రారంభించింది. ‘బగ్ బౌంటీ ప్రోగ్రామ్’ అంటే మరేమీ కాదు. చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు నిత్యం ఈ పని చేస్తూనే ఉంటాయి. తాము తయారుచేస్తున్న సాఫ్ట్వేర్ తాలూకు బీటా వెర్షన్ ని యూజర్లకి అందించి, దాన్ని వాళ్లు వాడేలా చేస్తారు. అందులో ఏ బగ్స్ ఉన్నాయో కనిపెడితే బహుమతులిస్తారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా అదే చేస్తోంది. బ్రౌజర్లో ఏ లోపాలున్నాయో చెబితే – ముఖ్యమైన బగ్స్ని గుర్తించినవారికి ముప్ఫైవేల డాలర్లు బహుమతి ఇస్తోంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు 21 లక్షల రూపాయలు!