కరోనా ఎఫెక్ట్: ఆ నాలుగు పట్టణాల్లో పరిస్థితి తీవ్రం..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించారు. అయితే.. కొన్ని నగరాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్ర
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించారు. అయితే.. కొన్ని నగరాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరాల్లో కరోనా కేసులు అధిక సంఖ్యలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
కాగా.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంగించడం కేసులు పెరగడానికి ఒక కారణమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో అల్లర్లు కూడా జరిగాయని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నివేదికలు తీసుకుంటున్నామని, అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్రం తీసుకున్న అతిపెద్ద చర్యల్లో ప్రస్తుత లాక్డౌన్ ఒకటని, ప్రజల ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తోందని చెప్పుకొచ్చారు.
Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..