పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌

ప్రజారవాణాకు పెద్ద పీట వేస్తోన్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. అందులో భాగంగానే... త్వరలోనే పాతబస్తీ మెట్రోరైల్ ప్రాజెక్ట్ ను...

పాతబస్తీలో మెట్రోను త్వరలో పూర్తి చేస్తాం : మంత్రి కేటీఆర్‌
Follow us

|

Updated on: Mar 11, 2020 | 1:30 PM

ప్రజారవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. అందులో భాగంగానే… త్వరలోనే పాతబస్తీ మెట్రోరైల్ ప్రాజెక్ట్ ను…పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… పాతబస్తీలో మెట్రో లైన్‌ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామని తెలిపారు.

మెట్రోలో కేంద్రం వాటా 10 శాతమేనని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్… అందులో ఇంకా రూ. 250 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ప్రజా రవాణాలో చాలా సీరియస్‌గా ఉందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో హైదరాబాద్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అందులో ప్రజా రవాణాకు చాలా పెద్ద పాత్ర ఉండబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రతీ రోజు దాదాపు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌ సిటీ వరకు.. ట్రామ్ లేదా ఇతర రవాణా మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అటు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌ నుమా వరకు 5 కిలోమీటర్ల కారిడార్ ను చేపడుతామని కేటీఆర్ అన్నారు. ఆ మార్గంలో హెరిటేజ్ భవనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.