డ్రైవర్ లెస్ కార్ల శ్రేణిలోకి ఇక మెర్సిడెస్ బెంజ్..
ఇప్పటికే పలు దేశాల్లో డ్రైవర్ రహిత కార్లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ శ్రేణిలోకి ఇప్పుడు లగ్జరీ కార్లు కూడా ఎంటర్ అవ్వబోతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్, బోష్ కంపెనీలు ఈ డ్రైవర్ లెస్ (ఎస్-క్లాస్) కార్లను రంగంలోకి దిగేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రైవర్ రహిత కార్లు.. ప్రస్తుతం యూఎస్లోని ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రమే నడపబోతున్నట్లు తెలుస్తోంది. శాన్జోస్, కాలిఫోర్నియా వెస్ట్ సైడ్, డౌన్టౌన్ […]
ఇప్పటికే పలు దేశాల్లో డ్రైవర్ రహిత కార్లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ శ్రేణిలోకి ఇప్పుడు లగ్జరీ కార్లు కూడా ఎంటర్ అవ్వబోతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్, బోష్ కంపెనీలు ఈ డ్రైవర్ లెస్ (ఎస్-క్లాస్) కార్లను రంగంలోకి దిగేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రైవర్ రహిత కార్లు.. ప్రస్తుతం యూఎస్లోని ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రమే నడపబోతున్నట్లు తెలుస్తోంది. శాన్జోస్, కాలిఫోర్నియా వెస్ట్ సైడ్, డౌన్టౌన్ కోర్తో పాటు.. సాన్కార్లోస్ స్ట్రీట్, స్టీవెన్స్ క్రీక్ బౌలేవార్డ్ మార్గాల్లో ఈ సర్వీసుల ట్రయల్ రన్ను నిర్వహించనున్నారు.
అయితే ఈ కార్లు అందరికీ అందుబాటులో ఉండబోవని తెలుస్తోంది. ఈ కంపెనీలు ఈ కార్ల సర్వీసు కోసం ఓ ప్రత్యేక యాప్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు ఈ సంస్థలు తెలిపాయి.