ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలకు షాక్…రెండోసారి మెమోలు.
ఏపీలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలపై మళ్లీ చర్యలు తీసుకునేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రంగం సిద్దం చేసింది. కౌన్సిలింగ్లో ప్రవేశాలు కల్పించిన పీజీ స్టూడెంట్లను ఎందుకు చేర్చుకోవడం లేదో ఆన్సర్ ఇవ్వాలని ఈ నెల 5న నోటీసులు ఇచ్చింది. సదరు నోటీసుల గడువు 8 వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. అన్ని ప్రైవేటు కాలేజీల నుంచి వచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని విశ్వవిద్యాలయం…రెండోసారి మెమోలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల్లోగా సమాధానమివ్వాలని […]
ఏపీలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలపై మళ్లీ చర్యలు తీసుకునేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రంగం సిద్దం చేసింది. కౌన్సిలింగ్లో ప్రవేశాలు కల్పించిన పీజీ స్టూడెంట్లను ఎందుకు చేర్చుకోవడం లేదో ఆన్సర్ ఇవ్వాలని ఈ నెల 5న నోటీసులు ఇచ్చింది. సదరు నోటీసుల గడువు 8 వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. అన్ని ప్రైవేటు కాలేజీల నుంచి వచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని విశ్వవిద్యాలయం…రెండోసారి మెమోలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల్లోగా సమాధానమివ్వాలని కోరింది. అలాగే స్టూడెంట్స్ ఆయా కళాశాలల్లో చేరాల్సిన గడువు ఈ నెల 10 వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో యూనివర్సిటీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రవేశాలను ప్రైవేటు మెడికల్ కాలేజీలు తప్పకుండా చేర్చుకోవాలని మరోసారి రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ హెచ్చరించారు.
యూనివర్సిటీ 2019-20 అకడమిక్ ఇయర్ లో 28 కాలేజీల్లో 3 వేల మందికి ప్రవేశాలు ఇచ్చింది. వీరికి ఏడాది చివరన యాన్వల్ ఎగ్జామ్స్ నిర్వహించాలి. కానీ లాక్ డౌన్తో నాలుగు నెలల పాటు కాలేజీలు నడవలేదు. జులై తర్వాత క్లాసెస్ ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడిస్తామని వర్శిటీ తెలిపింది. ఈ క్రమంలో కళాశాలలు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాయి. ఇంతలోనే ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించింది. సాధారణ డిగ్రీలకు ఆన్ లైన్ తరగతులతో ఎగ్జామ్స్ రాసే వీలుంటుంది. ప్రయోగాలే కీలకమైన ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశ్వవిద్యాలయం మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు.