మెగా హీరోకు జోడిగా ‘లై’ బ్యూటీ..!
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన మొదటి చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మనీషా రాజ్ను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి ఆమెను తప్పించి మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారట చిత్ర యూనిట్. తాజా […]
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన మొదటి చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మనీషా రాజ్ను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి ఆమెను తప్పించి మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారట చిత్ర యూనిట్.
తాజా సమాచారం ప్రకారం తమిళ బ్యూటీ మేఘా ఆకాష్ ను సంప్రదించారట చిత్ర నిర్మాతలు. మరి ఈ కొత్త హీరో తో నటించడానికి మేఘా ఆకాష్ ఓకే చెబుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నాడు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.