భూపాలపల్లిలో మెడికో దారుణ హత్య.. కాళ్లూ చేతులు కట్టేసి!
భూపాలపల్లిలో ఓ మెడికల్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాలేజీకని బయలు దేరిన యువకుడు హత్యకు గురై, బావిలో శవంగా తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి కనపర్తికి చెందిన ఓ విద్యార్థి.. ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకువెళ్లాడు వంశీ. ఎంతకీ రాకపోవడంతో.. మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా.. ఓ బావిలో […]
భూపాలపల్లిలో ఓ మెడికల్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాలేజీకని బయలు దేరిన యువకుడు హత్యకు గురై, బావిలో శవంగా తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి కనపర్తికి చెందిన ఓ విద్యార్థి.. ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకువెళ్లాడు వంశీ. ఎంతకీ రాకపోవడంతో.. మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా.. ఓ బావిలో శవమై తేలాడు.
కాళ్లూ, చేతులు కట్టేసి హత్య చేసిన అనంతరం వంశీని బావిలో పడేశారు గుర్తు తెలియని దుండగలు. రేగొండ మండలం కనపర్తిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మృతుడు వంశీ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే.. వంశీ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.