కవల పిల్లలకు జన్మనిచ్చిన కరోనా తల్లి..!

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు మరోసారి కరోనా సోకిన గర్భిణికి ప్రసవం చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చారు. మేడ్చల్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు గర్భిణికి శస్త్రచికిత్స చేయడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువులను తల్లినుంచి వేరు చేసి ఐసీయూలో ఉంచినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. తల్లికి నెగెటివ్‌ వచ్చాక శిశువులను తల్లివద్దకు చేర్చుతామని వివరించారు. ప్రస్తుతం పిల్లలు […]

కవల పిల్లలకు జన్మనిచ్చిన కరోనా తల్లి..!
Follow us

|

Updated on: May 30, 2020 | 6:29 PM

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు మరోసారి కరోనా సోకిన గర్భిణికి ప్రసవం చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చారు. మేడ్చల్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు గర్భిణికి శస్త్రచికిత్స చేయడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువులను తల్లినుంచి వేరు చేసి ఐసీయూలో ఉంచినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. తల్లికి నెగెటివ్‌ వచ్చాక శిశువులను తల్లివద్దకు చేర్చుతామని వివరించారు. ప్రస్తుతం పిల్లలు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అవసరమైతే పిల్లలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.