అఖిలేష్ పై మాయావతి గరం గరం.. పొత్తుకు టాటా..!
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్పీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్లో జరిగే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తానే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి అఖిలేష్ యాదవ్ పై తాను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓట్ల లెక్కింపు రోజు ఫలితాలు వెలువడిన అనంతరం తాను అఖలేష్ యాదవ్కు ఫోన్ చేశానన్నారు. ఆయన సరిగా స్పందించలేదని మాట్లాడలేదని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు ఎస్పీకి సహకరించలేదనేది ఆయన భావన. కూటమిగా ఉన్న సమయంలో తన […]
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్పీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్లో జరిగే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తానే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి అఖిలేష్ యాదవ్ పై తాను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఓట్ల లెక్కింపు రోజు ఫలితాలు వెలువడిన అనంతరం తాను అఖలేష్ యాదవ్కు ఫోన్ చేశానన్నారు. ఆయన సరిగా స్పందించలేదని మాట్లాడలేదని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు ఎస్పీకి సహకరించలేదనేది ఆయన భావన. కూటమిగా ఉన్న సమయంలో తన బాధ్యతను 100 శాతం నిర్వర్తించానని తెలిపారు. ఇక జూన్ 3న కూటమి రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అఖిలేష్.. సతీశ్ చంద్రకు ఫోన్ చేశారేగానీ తనతో మాట్లాడలేదని ఆమె విమర్శలు గుప్పించారు.