ఓటీటీవైపు ‘మాస్టర్’ చూపులు, సూర్య బాటలో విజయ్
సూర్య ఓటీటీవైపు మొగ్గుచూపడం వల్ల విజయ్ కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది
తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమా ‘సూరారై పోట్రు’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం క్రియేట్ చేశాడు. థియేటర్ల యాజమాన్యలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తినప్పటికీ సూర్య వెనక్కి తగ్గలేదు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు ఓపెన్ అవుతాయో స్పష్టత లేకపోవడంతో ప్రైమ్ ద్వారా ఆడియెన్స్ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. కాగా ఇప్పుడు అందరి చూపు విజయ్ ‘మాస్టర్’ పై పడింది. సూర్య ఓటీటీవైపు మొగ్గుచూపడం వల్ల విజయ్ కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది
తమిళంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘మాస్టర్’ చిత్రానికి ‘ఖైదీ’తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లపై స్పష్టత లేకపోవడం, ప్రొడ్యూసర్ల పరిస్థితిని కూడా అర్థం చేసుకోని..సినిమా ఓటీటీవైపు పయనిస్తే బెటర్ అంటూ కొందరు ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. మరి చిత్రబృందం నిర్ణయం ఎలా ఉంటుందో వేచిచూడాలి.
Also Read :
వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల