‘మిడతల దండు’ కనిపిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చెయ్యండి..!
పాకిస్థాన్ నుంచి భారత్లోకి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వీటి వల్ల ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చేర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే..అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మిడతలు కనిపిస్తే […]
పాకిస్థాన్ నుంచి భారత్లోకి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వీటి వల్ల ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చేర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే..అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులు అప్రమత్తమయ్యారు.
సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మిడతలు కనిపిస్తే వెంటనే కిసాన్ మిత్ర కాల్ సెంటర్లు(1800 425 1110) లేదా కలెక్టరేట్ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను సూచించారు. అంతేకాకుండా రైతులు, ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
Read More:
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..
CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..
ఆన్లైన్ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!
విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్సైట్..